By D M SATISH KUMAR , 11 September 2026

గత పాలకుల కక్షపూరిత కుట్రపై ప్రజాక్షేత్రంలో గెలిచిన ధర్మదీపం – 53 రోజుల చీకటి గాథకు ‘నిజం గెలిచింది’ ప్రతీక!

By D M SATISH KUMAR , 9 September 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన వీఆర్వో

కే.కోటపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

కే.కోటపాడు (అనకాపల్లి):

భూమి రికార్డు జారీ చేయడానికి ఓ రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ వారాడ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) గిడుతూరి సూర్యనారాయణ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా కే.కోటపాడు తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో కలకలం రేపింది.

ఘటన వివరాలు

By D M SATISH KUMAR , 8 September 2026

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మారుతున్న కాలానికి తగినట్లుగా రూపాంతరం చెందడమే సమర్థవంతమైన నాయకత్వమని మంగళగిరిలోని తెదేపా కాన్‌క్లేవ్‌లో నాయకులకు స్పష్టం చేశారు. నాయకులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, తమ వద్దకు వచ్చిన ప్రజలతో నిజాన్నే చెప్పాలని సూచించారు. అయ్యే పనులను వెంటనే పూర్తి చేయాలని, సాంకేతికంగా వీలుకాని విషయాలను స్పష్టంగా చెప్పాలే తప్ప, ప్రజలను ఆశల్లో పెట్టి తమ చుట్టూ తిప్పుకోకూడదని స్పష్టం చేశారు. నాయకులు తమ నైతిక విలువలను వీడకుండా నడుచుకున్నప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు.

By D M SATISH KUMAR , 6 September 2026

సమాజ నిర్మాణంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు మరువలేనివని రీజనల్ జాయింట్ డైరెక్టర్ స్కూల్స్ బి విజయభాస్కర్ కొనియాడారు.ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కొణతాల శ్రీనివాస్ అద్యక్షతన విశాఖపట్నంలో శనివారం ఒక ప్రైవేట్ హోటల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

By D M SATISH KUMAR , 6 September 2026

ఉపాధ్యాయుల సేవలను అవార్డులతో కొలవలేమని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు.ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిశోర్, ఎంపీ శ్రీ భరత్, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు,ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ఈ వేడుకల్లో పాల్గొని  విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో భాగంగా గత 14 సంవత్సరాలుగా విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ పిఎంశ్రీ జీవీఎంసీ హై స్కూల్ లో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న

By D M SATISH KUMAR , 28 August 2026

మానవీయ విలువలు, శాంతి సందేశంతో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రామేశ్వరి, విమల నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు)ను కలసి రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబుకు వారు పవిత్ర రాఖీ ధరింపజేసి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. సమాజంలో ద్వేషాలు తొలగి సోదరభావం, శాంతి, పరస్పర సద్భావనలు పెంపొందాలని ఈ సందర్భంగా వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సమయాన్ని వెచ్చించి వచ్చి తనకు రాఖీ కట్టి ఆశీస్సులు అందజేసిన బ్రహ్మకుమారీస్ ప్రతినిధులకు ఎమ్మెల్యే గణబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

By D M SATISH KUMAR , 27 August 2026

విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కోరమాండల్ ఇంటర్నేషనల్ సీఎస్‌ఆర్ నిధులు, సమగ్ర శిక్షా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గణబాబు గురువారం ప్రారంభించారు. శ్రీహరిపురం గణేష్ పార్కులో రూ. 15 లక్షలతో నిర్మించిన కోరమాండల్ కళావేదికను, మల్కాపురం జీవీఎంసీ హైస్కూల్‌లో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించిన బాలికల టాయిలెట్ బ్లాక్, రూ. 23.10 లక్షల సమగ్ర శిక్షా నిధులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే మూలగడలో రూ.

By D M SATISH KUMAR , 25 August 2026

భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తే బుల్డోజర్లు పంపుతామని కాగితాల్లో చెప్పే అధికారులు, క్షేత్రస్థాయిలో తీరా అక్రమ నిర్మాణం పూర్తయ్యాక చెప్తున్న సమాధానాలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కంటిముందే ప్లాన్ లేకుండా పునాదులు తీసి, గోడలు కట్టి, ఏకంగా స్లాబ్ నిర్మాణం వరకు పూర్తి చేసినా నోరు మెదపని అధికారులు... తీరా ఆ పనులేంటని నిలదీస్తే “పాపం... బిల్డింగ్ యజమానికి ప్లాన్ పెట్టుకోవాలని తెలియక స్లాబ్ వరకు కట్టేశారంట!” అంటూ యజమాని తరఫున వకాల్తా పుచ్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.