పరవాడ జూన్ 25 : (పిఆర్ న్యూస్ టుడే) పెందుర్తి నియోజకవర్గం, పరవాడ మండలంలోని వాడ చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దళాయిపాలెం గ్రామంలో 25 లక్షల రూపాయల ఎన్టీపీసీ (NTPC) సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ ప్రారంభించారు. అదేవిధంగా నాయుడుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నాయుడుపాలెం గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బీసీ బాలికల హాస్టల్ భవనాలను కూడా వారు ప్రారంభించడం జరిగింది.