By Nareshkarri111 , 28 June 2026

విశాఖపట్నం (అల్లిపురం): ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా అంగవైకల్యాన్ని శాశ్వతంగా దూరం చేయవచ్చని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు పిలుపునిచ్చారు. స్థానిక 32వ వార్డు పరిధిలోని అల్లిపురం, నేరేళ్ల కోనేరు వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, చిన్నారులకు పోలియో చుక్కలు వేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ... 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.

By Nareshkarri111 , 28 June 2026

విశాఖపట్నం (పిఆర్ న్యూస్ టుడే) విశాఖపట్నం image widgetవిశాఖపట్నం నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణపై నగర పోలీసులు గట్టి నిఘా ఉంచారు. మే-2026 నెలలో నగరవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 68 ఆస్తి నేరాల కేసులు నమోదు కాగా, వాటిపై నగర పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు క్రైమ్ వింగ్ డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి, రికార్డు స్థాయిలో 48 కేసులను ఛేదించాయి.

By Nareshkarri111 , 27 June 2026

కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్‌గా సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానం అభివృద్ధి, ధర్మ పరిరక్షణ, భక్తుల సేవకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా కందుల నాగరాజు పేర్కొన్నారు.“ఈ బాధ్యత నాకు ఒక పదవి మాత్రమే కాదు… అమ్మవారి సేవ చేసే మహద్భాగ్యం” అని డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు.

By Nareshkarri111 , 27 June 2026

విశాఖపట్నం, జూన్ 27: (పి ఆర్ న్యూస్ టుడే) నగరంలో భిక్షాటనను పూర్తిగా నిర్మూలించి, నిరాశ్రయులకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో విశాఖపట్నం నగర పోలీసులు ‘జ్యోతిర్గమయ’ పేరుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. నగర పోలీస్ కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు, కంట్రోల్ రూమ్ సీఐ మరియు వారి బృందం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న 14 మందిని అధికారులు గుర్తించారు. వారిని సురక్షితంగా రక్షించిన పోలీసులు, పునరావాసం కల్పించే నిమిత్తం షెల్టర్ హోమ్‌కు తరలించారు.

By Nareshkarri111 , 27 June 2026

గాజువాక (పి ఆర్ న్యూస్ టుడే)  గాజువాక నియోజకవర్గం 64వ వార్డు పరిధిలోని గంగవరం గ్రామం, రామాలయం వీధిలో గత కొంతకాలంగా వేధిస్తున్న డ్రైనేజీ లీకేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.కూటమిలో భాగంగా డ్రైనేజీ లీకేజీ కారణంగా వస్తున్న తీవ్ర దుర్వాసనతో తాము పడుతున్న ఇబ్బందులను టిడిపి సీనియర్ నాయకులు **బందు మాధవరావు** గారు మరియు స్థానిక మహిళలు.. జనసేన 64వ వార్డ్ ప్రెసిడెంట్, విశాఖ జిల్లా మాజీ పార్లమెంటు అధికార ప్రతినిధి **సిహెచ్. ముసలయ్య** గారి దృష్టికి తీసుకెళ్లారు.మహిళల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన సిహెచ్.

By Nareshkarri111 , 27 June 2026

పరవాడ, (పి ఆర్ న్యూస్ టుడే) :పరవాడ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ లంకా భాస్కరరావును జనసేన పార్టీ సీనియర్ నాయకులు అర్జిల్లి అప్పలరాజు, ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ జనసేన నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ భాస్కరరావుకు వారు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి నూతన బాధ్యతలకు గాను శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అర్జిల్లి అప్పలరాజు మాట్లాడుతూ.. పరవాడ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అగ్రతాంబూలం ఇవ్వాలని, బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని కోరారు.

By Nareshkarri111 , 26 June 2026

భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ    భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి కార్యక్రమం ఈ నెల 28న విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పివి నరసింహారావు జయంతి ఉత్సవాల కమిటీ ప్రకటించింది. శుక్రవారం శంకరమఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు కేశాప్రగడ నరసింహమూర్తి, కన్వీనర్ చెరుకు రామకోటయ్య కార్యక్రమ వివరాలు వెల్లడించారు.భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు తన దూరదృష్టి, రాజకీయ చాణక్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు.

By Nareshkarri111 , 26 June 2026

గోపాలపట్నం (prnewstoday): సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త, బోర్డు చైర్మన్, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదిన వేడుకలు శుక్రవారం విజయనగరంలోని ఆయన అతిథి గృహంలో ఘనంగా జరిగాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు దంపతులు అశోక్ గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందించి, స్వామివారి ప్రసాదాలను సమర్పించారు.

By Nareshkarri111 , 26 June 2026

గోపాలపట్నం జూన్ 26 : (pr newstoday) తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే ఓ పాత నేరస్థుడిని గోపాలపట్నం క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సింహాచలంలోని ప్రియ గార్డెన్స్ అపార్ట్‌మెంట్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన చోరీ మిస్టరీని పోలీసులు వేగంగా చేధించి, మల్కాపురం నివాసి అయిన నూనెల కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని దగ్గరి నుండి పెద్ద ఎత్తున బంగారాన్ని రికవరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..