గోపాలపట్నం : జీవీఎంసీ పచ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం వర్తకసంఘం సభ్యులు శాసనసభ్యులు గణబాబుని కలసి గోపాలపట్నం మెయిన్ రోడ్డులో దుకానాలవెనుకగల కాలువలు తుప్పలు పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంటుందని శానిటేషన్ సిబ్బందికి తెలిపి నివారణచర్యలు చేపట్టాలని అభ్యర్థనతో శాసనసభ్యులు నివారణచర్యలు చేపట్టాలని శానిటేషన్ అధికారులకు తెలిపారు. పచ్చిమ జోనల్ కమిషనర్ హేమవతి అసిస్టెంట్ మెడికల్ అధికారి హర్ష సుదర్శన్ ఇన్స్పెక్టర్ గోపి కార్యదర్శి దేవి కార్మికులను ఏర్పాటుచేసి పరిసరాలను కాలువలను శుభ్రపరచడం జరిగింది. వర్తకసంఘం సభ్యులు ప్రజలు శాసనసభ్యులు గణబాబు జీవీఎంసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేసారు.
- Log in to post comments
Comments